లక్ష కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు
NEWS Dec 27,2024 11:22 am
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చంద్రబాబు ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చాడని, ఇప్పటికే 7 నెలల్లో ఏకంగా లక్ష కోట్లు అప్పులు చేశాడని ఆరోపించారు. 6 నెలల్లోనే రూ. 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీలను ప్రజలపై కూటమి సర్కార్ భారం వేసిందని మండిపడ్డారు.