మల్యాలలో మన్మోహన్సింగ్కు నివాళి
NEWS Dec 27,2024 11:58 am
మల్యాల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మల్యాల మండల కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించి, నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించారు. భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, శోభారాణి, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, తిరుపతి, మల్లేశం, ప్రసాద్, ప్రతాప్, సంజీవ్, హరినాథ్, ఇమామ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.