కామారెడ్డి ఎస్సైతో పాటు లేడి కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యపైఎస్పీ సింధు శర్మ స్పందించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయని..సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం అన్నారు. ఎస్సై జేబులోనే సెల్ఫోన్ గుర్తించాం అని.. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేం అన్నారు. విచారణ కొనసాగుతోంది.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.