కుటుంబాల ను పరామర్శించిన ఆది
NEWS Dec 26,2024 06:48 pm
కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను, గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీను పరామర్శించారు. సౌదీలో మృతి చెందిన వారి కుటుంబాన్ని, సాక్షి గణేష్ వారి తమ్ముడు ఇవాళ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, భూషణ్రావుపేట పాస్టర్ శామ్యూల్ ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఇంటికి రావడంతో వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. వీరి వెంట సోషల్ మీడియా కన్వీనర్ కూన అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, మాజీ తాజా సర్పంచ్ సులోచన శీను పాల్గొన్నారు.