పుల్లంపేట: వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
NEWS Dec 26,2024 06:49 pm
పుల్లంపేట మండలంలోని దేవరకొండ సమీపంలో శ్రీ దేవరకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నందు గురువారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కారూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.