మందా జగన్నాథంను పరామర్శించిన హరీశ్
NEWS Dec 26,2024 11:39 am
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథంను పరామర్శించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. జగన్నాథం కుటుంబానికి ధైర్యంగా ఉండాలని చెప్పారు. హరీశ్ వెంట మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ , దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు.