ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వంగవీటి మోహన రంగా
NEWS Dec 26,2024 06:50 pm
వంగవీటి మోహన రంగా పేరే ఒక ప్రభంజనం, వ్యక్తిగా కాదు మహాశక్తిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ (గాంధీ). వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా కొండపల్లి స్టేషన్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు,రంగా అభిమానులు పాల్గొన్నారు.