ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల లో దారుణం చోటు చేసుకుంది.రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ సమీపంలో చెత్తకుండీలో ఆడ శిశువు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళారు. చెత్త కుండీలో ఆడ శిశువు కేకలు వినిపించడంతో స్థానికులు కుండీలో ఉన్న ఆడ శిశువుని హాస్పిటల్ కు తరలించారు. ఒంటిపై చీమలు పురుగులు పట్టి ఉండటంతో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.