విమానాశ్రయం ఏర్పాటు చేయాలి
NEWS Dec 26,2024 01:16 pm
నిజామాబాదు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చెయ్యాలని గల్ఫ్ కార్మికులు కోరుతున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల్లోనే గల్ఫ్ వెళ్లే కార్మికులు ఎక్కువగా ఉన్నందున, నిజామాబాద్ జిల్లా జక్రానపల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అందరికి అనుకూలంగా ఉంటుందని, గల్ఫ్ కార్మికులు వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమం లో దుబాయ్ గల్ఫ్ కార్మికులు పెనుకుల అశోక్,రఘపతి, మహేష్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.