శ్రీతేజ్ కు వేణు స్వామి ఆర్థిక సాయం
NEWS Dec 25,2024 11:23 am
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. బాబు త్వరగా కోలుకోవాలని ఈవారంలో మృత్యుంజయ హోమాన్ని తన స్వంత ఖర్చులతో చేస్తానని అన్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు తన వంతుగా రూ. 2 లక్షల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు.