మెదక్ చర్చితో విడదీయలేని బంధం
NEWS Dec 25,2024 09:58 am
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చర్చిని సందర్శించారు. ఈ సందర్బంగా ప్రార్థనలు చేశారు. ఈ చర్చితో తనకు విడదీయలేని బంధం ఉందన్నారు. పీసీసీ చీఫ్ గా ఇక్కడికి వచ్చానని, ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ఆనాడు సీఎం హోదాలో తిరిగి వస్తానని అన్నానని, అదే నిజమైందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభువు ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. చర్చి అభివృద్దికి నిధులు విడుదల చేశామన్నారు.