శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు సాయం
NEWS Dec 25,2024 09:39 am
టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో పాటు నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్బంగా నటుడు అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల తరపు నుంచి మొత్తం రూ. 2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాయానికి సంబంధించిన చెక్కులను దిల్ రాజుకు అందజేశామని తెలిపారు .