మార్కెట్ కమిటీల నియామకానికి శ్రీకారం
NEWS Dec 25,2024 08:03 am
సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సంక్రాంతికి రాష్ట్రంలోని మార్కెట్ యార్డు కమిటీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో సగానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానం కల్పించనున్నారు. క్షేత్ర స్థాయిలో 10 వేలకు పైగా పదవులు దక్కే ఛాన్స్ ఉంది. కూటమి నేతలకు నూతన ఏడాది కానుకగా ఇవ్వనున్నారు సీఎం. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీ పదవులను జనవరిలో భర్తీ చేయనున్నారు.