సైబర్ క్రైమ్ సిబ్బందికి అవగాహన సమావేశం
NEWS Dec 25,2024 07:30 am
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ సూచనల మేరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కాన్ఫరెన్స్ హాల్లో సైబర్ క్రైమ్ మీటింగ్ జరిగింది. సిబ్బందిని చైతన్యం చేయడం కోసం అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఎ.సి.పి వై. వెంకటేశ్వర రావు నిర్వహించారు.అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) మాట్లాడుతూ.. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందన్నారు .