28న రెండు వామపక్షాలు విలీనం
NEWS Dec 25,2024 07:28 am
నిజామాబాద్: రెండు ప్రధాన వామపక్ష పార్టీలు కలిసిపోనున్నట్లు నాయకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోని ఎన్ఆర్ భవన్లో విలీన సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 28న సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ పార్టీలు రెండు విలీనం కానున్నాయి. విలీన సభ హైదరాబాద్లోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు నాయకుడు ఆకుల పాపయ్య పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.