ఫార్ములా ఈ రేసు కేసుపై ఏసీబీ విచారణ
NEWS Dec 25,2024 05:59 am
హైకోర్టు ఉత్తర్వులు అందుకున్న ఏసీబీ దూకుడు పెంచింది. విచారణకు సంబంధించి రంగంలోకి దిగింది. ఫిర్యాదుదారుడు దాన కిషోర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ ప్రారంభించింది. ఆయన నుంచి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన తనను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు.