పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ
NEWS Dec 25,2024 05:48 am
పలు రాష్ట్రాలలో గవర్నర్లను బదిలీ చేసింది కేంద్రం. మరికొందరిని నియమించింది. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్గా బదిలీ చేసింది. మిజోరం గవర్నర్గా జనరల్ వీకేసింగ్ ను నియమించింది. బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కేరళ గవర్నర్గా బదిలీ చేయగా కేరళ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ఖాన్ ను బీహార్ కు బదిలీ చేసింది. మణిపూర్ గవర్నర్ గా అజయ్ కుమార్ భల్లాను నియమించింది.