ఒంటిమిట్ట విమాన గోపుర నిర్మాణానికి ఆమోదం
NEWS Dec 25,2024 05:13 am
ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో విమాన గోపురంలో బంగారు కలశం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో బంగారు కలశం నిర్మాణానికి సంబంధించి 43 లక్షల రూపాయలతో చేపట్టడానికి పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు.