చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు
NEWS Dec 25,2024 04:03 am
సీఎం చంద్రబాబు పాలనలో రైతన్నలకు మేలు జరుగుతోందని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడన్నారు. వ్యవసాయాన్ని, రైతులను గాలికొదిలేశాడన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాడన్నారు. అధిక విద్యుత్ ఛార్జీల భారంతో వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగి పోయాయన్నారు. తాము పవర్ లోకి రాగానే మోటార్ల బిగింపు అడ్డుకున్నామన్నారు.