బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
NEWS Dec 25,2024 04:32 am
మెట్ పల్లి: వేంపేట్ గ్రామంలో బైకు కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పై కిరణ్ కుమార్ తెలిపారు. మామిడాల రణధీర్ (22) హైదరాబాదులో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కొద్ది రోజులుగా తనకు బైకు కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడని, తర్వాత కొనిస్తామని చెప్పారని, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రణధీర్ గడ్డి మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అస్పత్రికి తరలించగా మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.