మల్యాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
NEWS Dec 24,2024 06:53 pm
మల్యాల మండల కేంద్రంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో మంగళవారం మండల అధికారులు, నాయకుల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న మండల క్రిస్టియన్ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీటీ నీతూ, ఆర్ఐ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, మల్లేశం, సంజీవ్, పాస్టర్ వినయ్, సుల్తాన్ సుదర్శన్, క్రైస్తవ సోదరసోదరీమనులు పాల్గొన్నారు.