ఈసేవా కేంద్రాన్ని ప్రారంభించిన జడ్జి
NEWS Dec 24,2024 03:45 pm
మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించిన 29 ఈ సేవా కేంద్రాల్లో భాగంగా మెట్పల్లి లో కూడా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సేవా కేంద్రంలో పలు రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందుతాయన్నారు.