ఆర్జీవీ డబ్బులు చెల్లించకపోతే కేసు
NEWS Dec 24,2024 11:20 am
ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్నెట్ నుంచి దర్శకుడు వర్మకు రూ.1 కోటి 15 లక్షలు అక్రమంగా చెల్లించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చామన్నారు. 15 రోజుల గడువు ఇచ్చామని, ఆ లోపు ఇవ్వక పోతే కేసు నమోదు చేస్తామన్నారు. చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్ట్ చేస్తామన్నారు.