కేసీఆర్..హరీశ్ రావుకు హైకోర్టు ఊరట
NEWS Dec 24,2024 08:33 am
కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిర్యాదుదారుడికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా మేడిగడ్డ కుంగు బాటుపై కేసీఆర్, హరీశ్ లకు నోటీసు ఇష్యూ చేసింది కోర్టు.