ఏసీపీ నేతృత్వంలో బన్నీ విచారణ
NEWS Dec 24,2024 07:45 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ ఇవాళ హైదరాబాద్ లోని చిక్కడపల్లి పీఎస్ కు హాజరయ్యారు. ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. బన్నీ వెంట న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఉన్నారు. 50కి పైగా ప్రశ్నలను అల్లు అర్జున్ ముందు ఉంచి పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.