రైతుల డీసీసీబీ అధికారులు నోటీసులు
NEWS Dec 24,2024 09:58 am
కామారెడ్డి జిల్లాలో రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం డీసీసీబీ బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారుతనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వడంతో పాటు పోలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో పరువు పోతోందని రైతులు వాపోతున్నారు.