అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం
NEWS Dec 24,2024 05:46 am
తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు ఏకంగా టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10 వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతి లో టీటీడీ ఈవో జె . శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్బంగా ఈవో, ఏఈవో సూర్య పవన్ కుమార్ ను అభినందించారు.