ఏపీని అప్పులపాలు చేసిన జగన్
NEWS Dec 24,2024 05:07 am
ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగారు. జగన్ ఏపీకి చేసింది ఏమీ లేదని, వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లాడని, వాటికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడని అన్నారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో రూ. 4.53 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని వ్యవస్థలను జగన్ సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. కూటమి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు.