ఎస్సీ..ఎస్టీ..బీసీల అభివృద్దిపై ఫోకస్
NEWS Dec 24,2024 05:03 am
సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు మంత్రి ఎస్ . సవిత. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల అభివృద్ధికి రూ.11.56 కోట్లు మంజూరు చేయడంపై ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి ధన్యవాదాలు తెలిపారు. గత జగన్ వైసీపీ సర్కార్ బహుజనుల వర్గాలను పట్టించు కోలేదని ఆవేదన చెందారు.