ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కవితా, రచనల పోటీల్లో విద్యార్థులు జిల్లాస్థాయిలో బహుమతులు గెలుచుకోవడం అభినందనీయమని గుండారం జెడ్పీ ఇన్చార్జి హెచ్ఎం గిరిధర్ అన్నారు.ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక అధ్యక్షుడు కాసర్ల నరేశ్రావు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న తెలుగు ఉపాధ్యాయులు దస్తగిరి, నరేంద్రమూర్తిలను అభినందించారు.