హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని
NEWS Dec 24,2024 04:08 am
మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని దావాలో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేసి, అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.