క్లీన్ సిటీ చేసే అందరూ తీసుకోవాలి
NEWS Dec 24,2024 04:35 am
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అహ్మదీబజార్ లో భారీ వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరూపయోగంగా ఉందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. నెల రోజుల్లోగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి ప్రజోపయోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రధాన ఏరియాల్లో ఫుట్ ఫాత్ లు కబ్జాలకు గురవడం, అక్రమ కట్టడాల నిర్మాణం వంటి కారణాలతో అవస్థలు పడుతున్నారు.