ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు సహకరించాలి
NEWS Dec 24,2024 04:19 am
మెట్పల్లి పట్టణంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు ప్రజలు సహకరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు లభిస్తాయని మున్సిపల్ ఛైర్ పర్సన్ రణవేణి సుజాత అన్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి 15 అంశాల్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో కమిషనర్ మోహన్, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.