అత్యాచారం దోషికి 20 ఏళ్ల శిక్ష
NEWS Dec 23,2024 04:03 pm
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో 2019లో జరిగిన మైనర్ బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడు గోగుల సాయికుమార్కు జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటనపై అప్పటి మల్లాపూర్ ఎస్సై పృథ్వీధర్ కేసు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి నీలిమ కేసు విచారణ చేపట్టి నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించారు. ఈ కేసును సమర్థంగా నిర్వహించిన అప్పటి ఎస్సై పృథ్వీధర్, మెట్పల్లి సీఐ రవి కుమార్ను అభినందించారు