బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఆ బ్యాంక్ అధికారులే కాజేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బేల చోటు చేసుకుంది. మనియార్ పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ ఏడాది ఆగస్టు నెల 28వ తేదీన బేలా మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.50 వేలు డ్రా చేసేందుకు విత్ డ్రా ఫాం రాసి ఇచ్చాడు..20 వేలు మాత్రమే ఇస్తామని మరో విత్ డ్రా ఫాం రాయమని బ్యాంక్ సిబ్బంది సూచించారు. దాంతో రూ.20 వేలకు ఫాం రాసి ఇచ్చాడు.