ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన
NEWS Dec 23,2024 11:58 am
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా వంటావార్పుతో వినూత్న నిరసన తెలిపారు.సమ్మె శిబిరం వద్ద వంటలు చేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా ఎన్టీఆర్ చౌక్ వరకు వచ్చి నిరసన తెలిపారు. రహదారిపై కూర్చొని ఉద్యోగులు అందరూ భోజనాలు చేస్తూ నిరసన తెలిపారు. వంటవార్పు సీఎం ఆలోచనల్లో మార్పు, సమగ్ర శిక్షా రెగ్యులర్ కోసం తీర్పు అంటూ నినాదాలతో హోరెత్తించారు