ఎలీషా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్
NEWS Dec 24,2024 02:07 pm
గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ మోగులూరి ఎలీషాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. విజయవాడలోని తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన 2 తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులైన పలువురిని గుర్తించి విజయవాడలో ఠాగూర్ గ్రంథాలయంలో వారిని సన్మానించారు. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేసి గజమాలతో సన్మానించారు.