మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని అల్లు అర్జున్ ఇంటిపై కొందరు రాళ్లతో దాడి చేయడాన్ని ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించ కూడదని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందన్నారు.