పరవాడ ఫార్మా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి వాసం శెట్టి సుభాష్. ఫార్మా కారాగారంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన చెందారు. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. విష వాయువు లీకేజీ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. ప్రమాదానికి కారణమైన సంస్థపై చర్యలు తీసుకుంటామని అన్నారు.