రుణాలు చెల్లించకపోతే భూముల వేలంకు నోటీసులు
NEWS Dec 23,2024 09:09 am
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం నమ్మించి మోసం చేయడం సరి కాదన్నారు.