కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి గందరగోళం చోటు చేసుకుంది . మేయర్ సురేష్కు మాత్రమే కుర్చీ వేశారు కార్పొరేషన్ సిబ్బంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి. సీటు కేటాయించక పోవడాన్ని తప్పు పట్టారు. మేయర్ పోడియం వద్ద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. కావాలని అవమానం చేశారంటూ వాపోయారు.