అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలోని తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బంగారు కిరీటం విరాళం ఇచ్చారు. చెన్నైకి చెందిన వసంత లక్ష్మి, ఆమె కుమార్తె మాధవి, అల్లుడు మనోహర్ లు రూ.27 లక్షల విలువైన 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు అధికారులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వారికి కిరీటాన్ని తొడిగారు.