అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం
NEWS Dec 23,2024 04:40 am
రేషన్ బియ్యం స్కాం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు, పేర్ని జయసుధలకు బిగ్ షాక్ తగిలింది. విచారణకు సంబంధించి హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు అంటించారు . ఇదిలా ఉండగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించారు. గోడౌన్ లలో 4800 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు.