శ్రీతేజ్ ను పరామర్శించిన బండి సంజయ్
NEWS Dec 23,2024 04:29 am
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్న శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతిని కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను ఓదార్చారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని, ఎంత ఖర్చైనా సరే భరిస్తామని స్పష్టం చేశారు.