హైవేలపై ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు
NEWS Dec 23,2024 04:34 am
జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మరణాలను నివారించేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 300 వరకు హెల్త్ సబ్సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కేన్సర్ చికిత్స కేంద్రాలతో పాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు.