విశ్వశాంతి మహాయగ మహోత్సవం
NEWS Dec 23,2024 04:30 am
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం ప్రారంభమైన యాగంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ దంపతులు పాల్గొన్నారు. కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ నేతృత్వంలో జరుగుతున్న విశ్వశాంతి మహాయగ మహోత్సవంలో భాగంగా చతుర్వేద పూర్వక మహా గణపతి, తొలిరోజు వివిధ పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆయన సతీమణి ఉమ పూజల్లో పాల్గొన్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు.