ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ విష్ణుమూర్తిపై వేటు పడింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్. కాగా విష్ణుమూర్తి గతంలో నిజామాబాద్ లో టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పని చేశారు. ఆరోపణలు రావడంతో డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. అక్టోబర్ 2024లో సస్పెండ్ అయ్యారు.