మిరప పంటతెగుళ్ల బెడద
NEWS Dec 23,2024 04:33 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4,700 ఎకరాల్లో మిరప పంట సాగవుతోంది. చలిగాలులు, మంచు కారణంగా కాపు దశలో ఉన్న మిరప పంటను పలు రకాల తెగుళ్లు ఆశిస్తున్నాయి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ క్రిముల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను సకాలంలో నివారిస్తేనే మేలైన దిగుబడులు వస్తాయని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శ్రీధర్చౌహాన్ వివరించారు.సర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు సోకితే ఆకులపై గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి.