సింగరేణి సీఎండీగా బలరాం నాయక్
NEWS Dec 23,2024 04:01 am
సింగరేణికి కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఐఆర్ఎస్ అధికారి బలరాం నాయక్ ను ప్రభుత్వం నియమించింది. సీఎండీగా ఉన్న ఎన్.శ్రీధర్ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా శ్రీధర్ను ఆదేశించింది. IRS అధికారి అయిన బలరాం నాయక్ ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.