సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చని పోయిందని చెప్పినా అల్లు అర్జున్ పట్టించు కోలేదని సంచలన ఆరోపణలు చేశారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్. సినిమా ముగిశాకే బయటికొస్తా అన్నాడని మండిపడ్డారు. ఈ ఘటన గురించి అల్లు అర్జున్ కు తెలియ చేస్తామంటే వాళ్ల మేనేజర్ పట్టించు కోలేదన్నాడు. ఇంకో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా సినిమా చూశాకే వస్తానని అన్నారని ఆరోపించారు.